ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలి రాజన్న సిరిసిల్ల జోన్ డిఐజి రమేష్ నాయుడు
![ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలి రాజన్న సిరిసిల్ల జోన్ డిఐజి రమేష్ నాయుడు](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63e26f15bb2eb.jpg)
ముద్ర ప్రతినిధి, మెదక్: ధనిక, పేద తారతమ్యం లేకుండా ప్రజలందరికీ ఒకే విదమైన సేవలు అందించి శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని రాజన్న సిరిసిల్ల జోన్ డిఐజి రమేష్ నాయుడు సూచించారు. మంగళవారం మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని స్వాగతం పలికారు. పోలీసు అధికారులతో ఎస్పీ కార్యాలయంలో సమీక్షించారు.
జిల్లాలోని స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మంచి పోలీసింగ్ చేసి పోలీస్ యొక్క ఇమేజ్ పెంచాలన్నారు. అలాగే సాకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్,తూప్రాన్ డి.ఎస్.పి సైదులు, యాదగిరి రెడ్డి, ఆర్.ఐ నాగేశ్వర్ రావ్, ఎస్.బి.సి.ఐ నవీన్ బాబు, సి.ఐ లు,ఎస్.ఐ లు, పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.