ఆంధ్రప్రదేశ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును పరామర్శించిన సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును పరామర్శించిన సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:- హృదయ సంబంధిత అనారోగ్యం తొ గచ్చిబౌలిలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ను సూర్యాపేట శాసనసభ్యులు, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగదీష్ రెడ్డి. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం అదే ఆసుపత్రిలో  అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆత్మకూర్  ఎస్ మండలం నసీంపేట గ్రామానికి చెందిన గుండపునేని హనుమంతరావు పరామర్శించారు. ఆయన వెంట జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్ తదితరులు ఉన్నారు.