ప్రమాదవశాత్తు డాబా మీద నుండి వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు డాబా మీద నుండి వ్యక్తి మృతి

కోదాడ, ముద్ర: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం శీతల తండాలో ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు డాబా పై నుండి  పడి మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. చిలుకూరు పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తండా కు చెందిన బాదావతు బాలాజీ(55) తన ఇంటి డాబా పై నున్న పాత ఇనుప సామాను ను కిందకు వేసే క్రమంలో పిట్ట గోడ మీద నుండి కిందికి పడిపోయాడు. అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి కావడంతో తో స్పాట్ లోనే మృతి చెందాడు.

బాలాజీ మండలంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఉండి, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు. ఆయన మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు, ఇతర పార్టీల నాయకులు తమ సంతాపం తెలిపారు. కాగా ఈ సంఘటన పై బాలాజీ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిలుకూరు పోలీసులు తెలిపారు.