పేదల గుడిసెలు తొలగించడం అన్యాయం
![పేదల గుడిసెలు తొలగించడం అన్యాయం](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_64775fd959d63.jpg)
కోదాడ, ముద్ర: పేదల గుడిసెలను పోలీసులు తొలగించడం అన్యాయమని సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్, ఏఐపికేఎంఎస్ రాష్ట్ర నాయకులు మట్టపల్లి ఆంజయ్య లు అన్నారు. బుధవారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కొమరబండలో 190 సర్వే నంబర్ లో వంద మంది పేదలు వేసిన గుడిసెలను పోలీసులు దౌర్జన్యంగా తొలగించడానికి నిరసిస్తూ సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలో ధర్నా , ర్యాలీ నిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ పేదల భూములను ప్రభుత్వం లాక్కోవడంఅప్రజాస్వామికమన్నారు. పేదలకు అండగా తమ పార్టీ ఉంటుందన్నారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్,పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, ఐఎఫ్టియూ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా రాంజీ,సింహాద్రి,వీరబాబు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.