కామ్రేడ్ గద్దర్ కు రంగస్థల కళాకారుల నివాళులు
![కామ్రేడ్ గద్దర్ కు రంగస్థల కళాకారుల నివాళులు](https://mudranews.in/uploads/images/2023/08/image_750x_64d0d4031cff4.jpg)
హుజూర్ నగర్ టౌన్ ముద్ర:ప్రజా యుద్దనౌక ప్రఖ్యాత విప్లవోద్యమ గాయకుడు కామ్రేడ్ గద్దర్ అకాల మరణానికి చింతిస్తూ హుజూర్ నగర్ పట్టణ రంగస్థల కళాకారులు సోమవారం పట్టణంలో సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహనీయుడు, ప్రముఖ వాగ్గేయకారుడు, ప్రజల గొంతుక ,విప్లవోద్యమ నాయకుడు, కామ్రేడ్ గద్దర్ కి కన్నీటి నివాళులు అర్పించారు.కార్యక్రమంలో సీనియర్ కళాకారుడు దొంతగాని సత్యనారాయణ, ధర్మోరి వెంకటేశ్వర్లు, గొట్టెముక్కుల రాములు, రామకృష్ణ, కొట్టు బాబు ,గోపన వెంకటేశ్వర్లు, కంబాల శ్రీను, దామోదరాచార్యులు పాల్గొన్నారు.