గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం

గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం
  • సర్పంచ్ అన్నెం 
  • శిరీషా కొండారెడ్డి

ముద్ర హుజూర్నగర్ టౌన్:-హుజూర్ నగర్ మండల పరిధిలోని వేపల సింగారం గ్రామంలో సోమవారం గ్రామ సర్పంచ్ అన్నెంశిరీష కొండారెడ్డి అంగన్వాడి స్కూల్లో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేస్తుందని అన్నారు. బిఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.