జిల్లా జైలు లో ఆహార నాణ్యతను పరిశీలించిన జిల్లా ఆహార తనిఖీ అధికారి

జిల్లా జైలు లో ఆహార నాణ్యతను పరిశీలించిన జిల్లా ఆహార తనిఖీ అధికారి

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట సూర్యాపేట జిల్లాలోని జిల్లా జైలు ను ఆహార భద్రత తనిఖీ అధికారులు శుక్రవారం పరిశీలించారు. రిమాండ్ ఖైదీలతో మాట్లాడి వారికి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వారికి అందుతున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారము వారికి అందుతున్న ఆహార పదార్థాల ముడి సరుకులను పరిశీలనకు పంపారు. వారికి అందుతున్న నీటి సరఫరా పరిశీలనకు పంపించినట్లు తెలియజేశారు. పూర్తిస్థాయి ప్రశాంత వాతావరణంలో శుచి శుభ్రత కలిగిన ఆహార పదార్థాలు ఖైదీలకు అందిస్తున్నారని అక్కడి అధికారులు వారికి తెలియజేశారు.

ఈట్ రైట్ క్యాంపస్ కొరకు సబ్ జైలు అధికారుల సమన్వయంతో ప్రత్యేక ద్రువపత్రం కొరకు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. వీరి వెంట జిల్లా సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి , జైలు సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి, ఖలీల్, శ్రీనివాస్, జానకి రాములు, శ్రావణ్ , ఆడిటర్ మోహిజ్ తదితరులున్నారు