కళాసిగూడ ఘటనలో ఇద్దరు అధికారుల సస్పెన్షన్
కళాసిగూడ ఘటనపై బల్దియా చర్యలు తీసుకుంది. ఇద్దరు అధికారులను జీహెచ్ఎంసీ సస్పెండ్ చేసింది. బేగంపేట అసిస్టెంట్ ఇంజనీర్ తిరుమలయ్యపై వేటు వేశారు. వర్క్ ఇన్స్పెక్టర్ హరికృష్ణను సస్పెండ్ చేశారు. నాలాలో పడి చిన్నారి మృతి చెందిన ఘటనపై విచారణకు ఆదేశించారు. దీనిపై 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆదేశించారు.