కళాసిగూడ ఘటనలో ఇద్దరు అధికారుల సస్పెన్షన్​ 

కళాసిగూడ ఘటనలో ఇద్దరు అధికారుల సస్పెన్షన్​ 

కళాసిగూడ ఘటనపై బల్దియా చర్యలు తీసుకుంది. ఇద్దరు అధికారులను జీహెచ్​ఎంసీ సస్పెండ్​ చేసింది. బేగంపేట అసిస్టెంట్​ ఇంజనీర్​ తిరుమలయ్యపై వేటు వేశారు. వర్క్​ ఇన్​స్పెక్టర్​ హరికృష్ణను సస్పెండ్​ చేశారు. నాలాలో పడి చిన్నారి మృతి చెందిన ఘటనపై విచారణకు ఆదేశించారు. దీనిపై 10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని జీహెచ్​ ఎంసీ కమిషనర్​ ఆదేశించారు.