మెదక్​లో  ‘నీతోనే నేను' టీజర్ లాంచ్

మెదక్​లో  ‘నీతోనే నేను' టీజర్ లాంచ్


ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్​ జిల్లా టేక్మాల్​ మండలం ఎల్లుపేట గ్రామానికి చెందిన  మామాడి సుధాకర్​రెడ్డి నిర్మాణ సారథ్యంలో నిర్మించిన ‘‘నీతోనే నేను” మూవీ టీజర్ లాంచ్ ఆదివారం రాత్రి మెదక్​ పట్టణంలోని సాయిబాలాజీ  గార్డెన్స్​లో ఘనంగా జరిగింది. అంజిరామ్​ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో హీరోగా వికాస్​ వశిష్ట,  హీరోయిన్లుగా మోక్ష, క్రుశిత కల్లపు నటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్​ ఫంక్షన్​లో పలువురు వక్తలు మాట్లాడుతూ... మెదక్​ జిల్లా వాసి ఒక సినిమాను నిర్మించడం ఆనందంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్​ అభిరామ్​ టీమ్​ అలరించగా... మృదుల యాంకరింగ్​ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆరు పాటలకుగాను నాలుగు పాటలను రిలీజ్​ చేశారు.