మెదక్లో ‘నీతోనే నేను' టీజర్ లాంచ్
ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎల్లుపేట గ్రామానికి చెందిన మామాడి సుధాకర్రెడ్డి నిర్మాణ సారథ్యంలో నిర్మించిన ‘‘నీతోనే నేను” మూవీ టీజర్ లాంచ్ ఆదివారం రాత్రి మెదక్ పట్టణంలోని సాయిబాలాజీ గార్డెన్స్లో ఘనంగా జరిగింది. అంజిరామ్ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో హీరోగా వికాస్ వశిష్ట, హీరోయిన్లుగా మోక్ష, క్రుశిత కల్లపు నటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పలువురు వక్తలు మాట్లాడుతూ... మెదక్ జిల్లా వాసి ఒక సినిమాను నిర్మించడం ఆనందంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ అభిరామ్ టీమ్ అలరించగా... మృదుల యాంకరింగ్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆరు పాటలకుగాను నాలుగు పాటలను రిలీజ్ చేశారు.