తెలంగాణ జాతిపిత జయశంకర్ కు ఘన నివాళులు

తెలంగాణ జాతిపిత జయశంకర్ కు ఘన నివాళులు

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ సిద్ధాంతకర్త జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ప్రిన్సిపాల్ గణపతి పూలమాలవేసి నివాళి  అర్పించారు. ఈ సందర్బంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.తెలంగాణ తొలి ఉద్యమకారుడు మూడు తరాల ఉద్యమంలో పాల్గొని తన జీవితాన్ని తెలంగాణ సాధనకు అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్ డా.చంద్రశేఖర్,  సురేందర్ రావు, అంజయ్య, సిబ్బంది మల్లికార్జున్, మానయ్య,
మాజీ కౌన్సిలర్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు.

  • జిల్లా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో..

జిల్లా స్వర్ణకార (విశ్వ బ్రాహ్మణ) ఆధ్వర్యంలో మెదక్ రాందాస్ చౌరస్తాలో ఆచార్య జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయశంకర్ సార్ తెలంగాణ కోసం చేసిన ఉద్యమాలను స్పందించుకున్నారు. జిల్లా అధ్యక్షులు పూన రవి, పట్టణ అధ్యక్షులు చదువుల రమేష్ తో పాటు స్వర్ణకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.