ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి

తుంగతుర్తి ముద్ర:-ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నష్టపోతుందని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ ప్రజలు బాగుపడతారని ఆ దిశగా ఉద్యమించిన మహానేత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని తుంగతుర్తి మండల  బిఆర్ఎస్ నాయకులు అన్నారు .ఆదివారం తుంగతుర్తి మండల కేంద్రంలో మండల  బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జయశంకర్ సార్ ఆశయ సాధనకు కృషి చేస్తున్నారని తెలంగాణ ప్రజలందరూ జయశంకర్ సార్ సూచించిన మార్గంలో పయనించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య ,వైస్ ఎంపీపీ శ్రీశైలం,మండల ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు , గ్రంధాలయ చైర్మన్ గోపగాని రమేష్, కటకం సూరయ్య, తునికి సాయిలు, లతోపాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.