ఆరాధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు .

ఆరాధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు .
  • ప్రొపెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి.
  • తెలంగాణ జాతిపిత గా జయశంకర్ సార్ కు ప్రబుత్వం బిరుదు ప్రకటించాలి.
  • ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణీ శ్రీకాంత్ రాజ్.

మోత్కూర్ (ముద్ర న్యూస్) : మోత్కూరు మండల కేంద్రంలో ఆరాధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంత కర్త తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు నిర్వహించి జయశంకర్ సార్ చిత్రపటానికి  తెలంగాణ ఉద్యమకారులు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్  పూలమాలలు వేసి నివాళులర్పించారు.ముందుగా అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఆరాధ్య ఫౌండేషన్ మోత్కూర్ మండల శాఖ ఆధర్యంలో తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ కూతురు ఆరాధ్య పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులు ఎస్ ఎన్ చారి, వెలిమినేటి జహంగీర్ ,దబ్బేటి సోంబాబు, డాక్టర్ వెంకటేశ్వర్లు, బుంగపట్ల యాకయ్య, గణగాని నర్సింహా,కురుమేటి యాదయ్య, సూరారం నర్సింహా, బోడ దేవస్వామి, మెంట సురేష్ తదితరులు పాల్గొన్నారు.