న్యాయమూర్తికి  మంత్రి ప్రాణరక్షణ

న్యాయమూర్తికి  మంత్రి ప్రాణరక్షణ

ముద్ర ప్రతినిధి,  సూర్యాపేట: సూర్యాపేట శాసన సభ్యుడు ,  రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమయస్పూర్తి న్యాయమూర్తి ప్రాణాలను నిలబెట్టింది. సూర్యాపేట నియోజకవర్గం చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరిలో   ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి సుజాత ప్రయాణిస్తున్న వాహనం  అదుపుతప్పి పల్టీ కొట్టింది.

ప్రమాదంలో న్యాయమూర్తి సుజాత తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పోలీసులు ప్రథమ చికిత్స కోసం ఆమెను సూర్యాపేట ఏరియా ఆసుపత్రి కి తరలించారు. ఆ సమయంలో తిరుమలగిరిలో  ఓ శుభకార్యానికి హాజరైన మంత్రి  జగదీశ్​ రెడ్డి ఈ విషయం తెలుసుకొని   వెంటనే  ఏరియా ఆసుపత్రి కి చేరుకుని సుజాత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అవసరం ఉందని వైద్యులు చెప్పడం తో , వెంటనే మూడు జిల్లా ల ఎస్పీలను  అలెర్ట్ చేసి, సూర్యాపేట నుండి హైదరాబాద్ వరకు జాతీయ రహదారి  పై ఉన్న పోలీసు స్టేషన్ సిబ్బందిని ట్రాఫిక్ క్లియర్​ చేసే విధంగా  ఆదేశాలు జారీ చేశారు. ఓ వైపు జోరున వర్షం కురుస్తుండటంతో  ఇబ్బందులు తలెత్తకుండా సుజాతని తరలించే అంబులెన్స్ ను  తన కాన్వాయ్ మధ్య లో ఉంచి రక్షణగా హైదరాబాద్ కు తరలించారు. మంత్రి  సమయస్పూర్తితో కేవలం గంటా  పదిహేను నిమిషాలలో సుజాతని హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఆమెకు   ఓ  ప్రైవేట్ ఆసుపత్రిలో  చికిత్స  చేస్తున్నారు. సకాలంలో సుజాత ను హైదరాబాద్ తరలించడం మంచి పరిణామం అని వైద్యులు తెలిపారు. న్యాయవాది అయిన జగదీశ్​ రెడ్డి   న్యాయమూర్తిని సకాలంలో  హైదరబాద్  కు తరలించడంపై   న్యాయవాదులు, ప్రజలు కొనియాడుతున్నారు.