ఎస్వీ  డిగ్రీ కళాశాల ప్రభుత్వ పరం చేయాలి 

ఎస్వీ  డిగ్రీ కళాశాల ప్రభుత్వ పరం చేయాలి 

ముద్ర ప్రతినిధి,  సూర్యాపేట:సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో  సెల్ఫ్ ఫైనాన్స్ విధానం ఎత్తివేయాలని, కళాశాలను ప్రభుత్వపరం చేయాలని డిమాండ్‌ చేస్తూ  పీడీఎస్​యూ విద్యార్థి  సంఘం ఆధ్వర్యంలో సోమవారం  తరగతులు బహిష్కరించారు. కళాశాల నుంచి   ఏరియా హాస్పిటల్ వరకు   పీడీఎస్​యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు  నాగరాజు ఆధ్వర్యంలో ర్యాలీ  నిర్వహించారు.  జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం విచారకరమని, దీనివల్ల  పేద విద్యార్థులు డిగ్రీ చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని, కళాశాలలో మూత్రశాలలు,  మరుగుదొడ్లు కట్టించాలని , ఇతర సమస్యలన్నీ  పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్​యూ నాయకులు, కళాశాల విద్యార్థులు నినాదాలు చేశారు.