ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రభుత్వ పరం చేయాలి
![ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రభుత్వ పరం చేయాలి](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_64fed89714c40.jpg)
ముద్ర ప్రతినిధి, సూర్యాపేట:సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ విధానం ఎత్తివేయాలని, కళాశాలను ప్రభుత్వపరం చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం తరగతులు బహిష్కరించారు. కళాశాల నుంచి ఏరియా హాస్పిటల్ వరకు పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం విచారకరమని, దీనివల్ల పేద విద్యార్థులు డిగ్రీ చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని, కళాశాలలో మూత్రశాలలు, మరుగుదొడ్లు కట్టించాలని , ఇతర సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ నాయకులు, కళాశాల విద్యార్థులు నినాదాలు చేశారు.