కాంగ్రెస్​ బోణి...!

కాంగ్రెస్​ బోణి...!
  • అశ్వారావుపేట, ఇల్లందులో కాంగ్రెస్​ గెలుపు
  • ఆరు మంత్రులు వెనకంజ
  • హుజూరాబాద్​లో మూడో స్ధానంలో ఈటల
  • కామారెడ్డిలో కేసీఆర్​ ఎదురీత
  • యాకుత్​పురలో బీజేపీ లీడ్​

ముద్ర, తెలంగాణ ముద్ర : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్​ బోణి కొట్టింది. అశ్వారావుపేట నుంచి పోటీ చేసిన ఆదినారాయణ రావు సమీప బీఆర్​ఎస్​ అభ్యర్ధి, సిట్టింగ్​ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావుపై 23,358 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇల్లందు నుంచి పోటీ చేసిన కాంగ్రెస్​ అభ్యర్ధి కోరం కనుకయ్య సిట్టింగ్​ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్​పై 18వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్​ 63 సెగ్మెంట్లలో ముందంజలో ఉండగా, బీఆర్​ఎస్​ 40, బీజేపీ పది, ఎంఐఎం నాలుగు స్ధానాల్లో లీడ్​ లో ఉంది. కాగా యాకుత్​పురలో బీజేపీ అభ్యర్ధి వీరేందర్​ యాదవ్​ ముందంజలో ఉన్నారు. వీరితో పాటు ఆరు మంత్రులు పువ్వాడ అజయ్​కుమార్​, ఇంద్రకరణ్​ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్​రావు, నిరంజన్​ రెడ్డి, కొప్పుల ఈశ్వర్​, వేముల ప్రశాంత్​రెడ్డి వెనుకంజలో ఉన్నారు. పాలేరు బీఆర్​ఎస్​ అభ్యర్ధి కందాల ఉపేందర్​రెడ్డి, భూపాలపల్లి అభ్యర్ధి గండ్ర వెంకటరమణా రెడ్డి, వర్ధన్నపేట అభ్యర్ధి ఆరూరి రమేశ్​ కౌంటింగ్​ మద్యలోనే కేంద్రాల నుంచి వెనుదిరిగారు.