కోదాడ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు

కోదాడ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు

ముద్ర ప్రతినిధి , కోదాడ: కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనకు ఓటు వేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కోదాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలోఆమె మాట్లాడారు.

గత నెల రోజులుగా తన గెలుపుకై శక్తి వంచనా లేకుండా కృషిచేసిన కాంగ్రెస్, తెదేపా,సిపిఐ పార్టీలు మరియు ముదిరాజ్ సంఘం నాయకులకు , మీడియా, పోలింగ్ అధికారులకు, పోలీస్ సిబ్బందితో పాటు అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా యువతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కోదాడలో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో పాటు టీవీలలో వస్తున్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం చాలా సంతోషకరమని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక బాధ్యతలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు . ఈ కార్యక్రమంలో చింతకుంట్ల. లక్ష్మీనారాయణ రెడ్డి , వంగవీటి రామారావు, కీసర సంతోష్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఈదుల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.