కబడ్డీ పోటీలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలి
![కబడ్డీ పోటీలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలి](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_6457ac35c1de4.jpg)
జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు బెల్లంకొండ రామ్ చందర్ గౌడ్
హుజూర్నగర్ ముద్ర: కబడ్డీ పోటీలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు బెల్లంకొండ రామచంద్ర గౌడ్ ,జాతీయ కబడ్డీ క్రీడాకారుడు దేవారంరవీందర్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంపులో నిర్వహిస్తున్న వేసవి కబడ్డీ శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. కబడ్డీ క్రీడలు నైపుణ్యాలను పెంపొందించుకొని రాష్ట్ర జాతీయ స్థాయిల్లో రాణించాలని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు బెల్లంకొండ రామచంద్ర గౌడ్ జాతీయ కబడ్డీ క్రీడాకారుడు దేవారం రవీందర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంపులో నిర్వహిస్తున్న వేసవి కబడ్డీ శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. జిల్లాలో కబడ్డీ అభివృద్ధికి అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక శిబిరాలు నిర్వహిస్తున్నామని యువత దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జిల్లాలో కబడ్డీ అభివృద్ధికి అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక శిబిరాలు నిర్వహిస్తున్నామని యువత దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు సునీల్, దేవిశెట్టి రవి ,మైసయ్య శ్రీనివాస్,వెంకటేశ్వర్లు, ఉస్మాన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.