సమ్మె పేరుతో బంగారు భవిష్యత్తును ఆగం చేసుకోవద్దు.
![సమ్మె పేరుతో బంగారు భవిష్యత్తును ఆగం చేసుకోవద్దు.](https://mudranews.in/uploads/images/2023/05/image_750x_645a60b12865d.jpg)
తిరిగి విధుల్లో చేరండి జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు
ముద్ర ప్రతినిధి, సూర్యాపేట సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరాలని జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు ప్రకటనలో పేర్కొన్నారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సమ్మెలో కొనసాగడం చట్ట విరుద్ధమని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో విధులలో చేరేందుకు ఒక అవకాశం ఇచ్చిందన్నారు. వీధుల్లో చేరని వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని నోటీసులో పేర్కొన్నట్లు స్పష్టం చేశారు. సమ్మె పేరుతో బంగారు భవిష్యత్ ఆగం చేసుకోవద్దని సూచించారు.