కాంగ్రెస్, బిజెపివి హత్య రాజకీయాలు

కాంగ్రెస్, బిజెపివి హత్య రాజకీయాలు
  • టిఆర్ఎస్ శ్రేణుల ధ్వజం

ముద్ర, స్టేషన్ ఘన్‌పూర్: కాంగ్రెస్, బిజెపి పార్టీలు రాష్ట్రంలో హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయని స్టేషన్ ఘన్ పూర్ మండల టిఆర్ఎస్ శ్రేణులు ధ్వజమెత్తారు. బుధవారం టిఆర్ఎస్ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చింతకుంట్ల నరేందర్ రెడ్డి, బూర్ల శంకర్, బెల్దే వెంకన్న, పోగుల సారంగపాణి, చేపూరి వినోద్ మాట్లాడుతూ దుబ్బాక టిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై అత్యాయత్నం చేయించిన కాంగ్రెస్, బిజెపి పార్టీలు పచ్చని తెలంగాణలో చిచ్చు లేపుతున్నాయని ధ్వజమెత్తారు. రాజకీయంగా టిఆర్ఎస్ ను ఎదుర్కోలేక కాంగ్రెస్ బిజెపి పార్టీలు మత విద్వేషాలు, రాజకీయ హత్యలు చేయించేందుకు ప్రేరేపిస్తున్నాయి అన్నారు. ఇప్పటికైనా ఆ రెండు పార్టీలు తమ పద్ధతిని మార్చుకుని రాజకీయంగా టిఆర్ఎస్ ను ఎదుర్కోవాలని సవాలు విసిరారు. ఈ సమావేశంలో మెట్పల్లి రమేష్, గండు నరసింహులు, గుర్రం రాజు, లకావత్ చిరంజీవి, పురమాని రజాక్, బూర్ల రాజు, నీల ఐలయ్య, స్వామి నాయక్, కుంభం కుమార్, నీరటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.