జనగామలో ‘పొన్నాల’ సందడి..

జనగామలో ‘పొన్నాల’ సందడి..
Ponnala

ముద్ర ప్రతినిధి, జనగామ : టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య జనగామ జిల్లా కేంద్రంలో శనివారం సందడి చేశారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగిపుగా పొన్నాల కొన్ని రోజులుగా జిల్లాలో హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

శనివారం ఉదయం తరిగొప్పల మండలంలో యాత్ర నిర్వహించిన పొన్నాల సాయంత్రం జనగామ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుని నాయకులు, కార్యకర్తలను కలసి టీ తాగుతూ ముచ్చటించారు. పొన్నాలను చూసిన స్థానికులు ఆయనతో ఫొటోలు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అనంతరం పట్టణంలో ఉంటున్న వెంకిర్యాల ఎంపీటీసీ కొమ్మరాజు సాలమ్మ కుటుంబాన్ని పొన్నాల పరామర్శించారు. సాలమ్మ భర్త అంజయ్య ఆనారోగ్యంతో చికిత్స పొంది ఇటీవల డిస్చార్ట్‌ అయ్యారు.