'రెయిన్‌బో' తొలి షెడ్యూల్ పూర్తి

'రెయిన్‌బో' తొలి షెడ్యూల్ పూర్తి

రష్మిక మందన ప్రధాన పాత్రలో రూపొందుతున్న తెలుగు తమిళ ద్విభాషా రోమాంటిక్ ఫాంటసీ ఎంటర్ టైనర్ 'రెయిన్‌బో. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు ఎస్ఆర్  ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రంలో దేవ్ మోహన్ మరో ప్రధాన పాత్ర పోహిస్తున్నారు. నూతన దర్శకుడు శాంతరూబన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటివలే ఈ చిత్రం తొలి షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేసుకుంది. కోడైకెనాల్ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఇప్పుడు 'రెయిన్‌బో' సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కి సిద్ధమౌతోంది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభమౌతుంది. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. భాస్కరన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్ ప్రొడక్షన్ డిజైన్ ఇన్‌ఛార్జ్‌గా పని చేస్తున్నారు. ఇ. సంగతమిళన్ ఎడిటర్.