మహనీయులను స్మరించుకోవాలి

మహనీయులను స్మరించుకోవాలి

జాయింట్ కలెక్టర్ మధుసూదన్ నాయక్

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల :సమాజశ్రేయస్సు కోసం తపించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జాయింట్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. సోమవారం మాదరి భాగ్యారెడ్డి వర్మ 135వ జయంతి వేడుకలను కలెక్టర్ కార్యాలయం లో అధికారికంగా నిర్వహించారు. ఈసందర్భంగా భాగ్యారెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ భాగ్యారెడ్డి వర్మ దళితుల పిల్లలకు విద్యను అందించాలనే మంచి మనసుతో పాఠశాలలు నెలకొల్పారని కొనియాడారు. బాల్య వివాహాలు నిరోదించాలని, మద్యపానం నిషేధించాలని ఉద్యమించారని గుర్తు చేశారు. ఈకార్యక్రమంలో అధికారులు రవీందర్ రెడ్డి, సురేష్, రవీందర్ గౌడ్, మాల మహానాడు నాయకుడు పొట్టు మధుకర్ తదితరులు పాల్గొన్నారు.