నోయిడాలో దారుణం

నోయిడాలో దారుణం
  • మహిళ న్యాయవాదిని హత్య చేసిన భర్త

ముద్ర, తెలంగాణ బ్యూరో : సుప్రీం కోర్టు న్యాయవాది రేణు సిన్హా (61)ను ఆమె  భర్త నితిన్ నాథ్ సిన్హా హత్య చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యాయవాది రేణు  సిన్హా, భర్త నితిన్ నాథ్ సిన్హా కలిసి నోయిడా సెక్టార్ 30 బంగ్లాలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా ఆమె కనిపించకుండా పోయింది. ఆమె సోదరుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు.దీంతో రేణు సోదరుడికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారాన్ని అందజేశాడు. ఆమె భర్తే హత్య చేసి ఉండి ఉండవచ్చని ఆరోపించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు న్యాయవాది రేణు సిన్హా బంగ్లాలో వెతకగా, ఆమె బాత్రూమ్ లో శవంగా కనిపించింది. అయితే ఆమె భర్త నితిన్ నాథ్ సిన్హా మాత్రం కనిపించలేదు. ఆయన కోసం పోలీసులు గాలించగా ఎక్కడా ఆచూకీ లభించలేదు. నితిన్ ఫోన్ నంబర్ ను ట్రాక్ చేయగా  ఆయన బంగ్లా వద్ద సిగ్నల్స్ చూపించింది. దీంతో పోలీసులు బంగ్లా  మొత్తం వెతక్కగా చివరకు స్టోర్ రూమ్ లో  నితిన్ నాథ్ కనిపించాడు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. దాదాపు 36 గంటల పాటు నితిన్ స్టోర్ రూమ్ లోనే దాక్కున్నట్లు పోలీసులు తెలిపారు.