పోచమ్మ గుడిలో చోరీ

పోచమ్మ గుడిలో చోరీ

ముద్ర, మల్యాల : మండలంలోని ముత్యంపేట గ్రామంలో పోచమ్మ ఆలయంలో శనివారం రాత్రి హుండీ చోరీకి గురైంది. ఆదివారం ఉదయం గుడికి వెళ్లిన గ్రామపెద్దలు చోరి జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదుచేశారు. హుండిని పగులగొట్టి సుమారు రూ.20వేల నగదు, బంగారం, వెండి ఆభరణాలు అపహరించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు దేవాలయాన్ని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  తెలిపారు.