మల్యాలలో కొనసాగుతున్న బంద్...

మల్యాలలో కొనసాగుతున్న బంద్...

ముద్ర, మల్యాల: ఆర్టీసీ బస్సులో జరిగిన సంఘటనలో ఒక వర్గం ఆరోపణలు పరిగణoలోకి తీసుకోని, ఎస్సై అనిల్ పై చర్యలు తీసుకోవడాన్ని నిరసిస్తూ వివిధ హిందు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మల్యాలలో బంద్ కొనసాగుతోంది.. పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్చందంగా బంద్ పాటించారు. ఈ సందర్బంగా బంద్ పాటించిన వ్యాపారులకు ఎంపీటీసీ సభ్యుడు రాచర్ల రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పలువురు యువకులు మాట్లాడుతూ ఎస్సై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కాగా, బంద్ సందర్బంగా ఎలాంటి సంఘటలు చోటుచేసుకోలేదు.