భోజనం పడవేస్తున్న విద్యార్థులను కొట్టిన వసతి గృహ అధికారిని ....

భోజనం పడవేస్తున్న విద్యార్థులను కొట్టిన వసతి గృహ అధికారిని ....

విద్యార్థుల తల్లిదండ్రులు, ఏబీపీ నిరసన..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో గల బీసీ వెల్ఫేర్ బాలికల వసతి గృహంలో అన్నం బాగాలేక విద్యార్థులు పడవ వేస్తున్నారని వసతి గృహాధికారిని పలువు విద్యార్థులపై చేయి చేసుకున్నారు. విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులకు చేప్పడంతో తల్లిదండ్రులు, ఏబివిపి నాయకులు వచ్చి కళాశాలలో ఆందోళన నిర్వహించారు.

విషయం తెలుసుకున్న జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి సాయి సంఘటన స్థలం చేరుకుని విద్యార్థులకు, వారి వారి తల్లిదండ్రులకు నచ్చచెప్పి విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటామని తెలిపారు. దీంతో అటు విద్యార్థులు ఇటు ఏబీవీపీ  నాయకులు ఆందోళన విరమించారు.