రూ.2.5 లక్షల ఎల్ ఓ సి అందజేత...

రూ.2.5 లక్షల ఎల్ ఓ సి అందజేత...

వెల్గటూర్, ముద్ర: జగిత్యాల జిల్లా, వెల్గటూర్ గ్రామానికి చెందిన గౌడ సంఘం అధ్యక్షు డు బందెల నర్సయ్య  తల్లి  బందెల లక్ష్మి గత కొన్ని రోజుల నుండి  అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ క్రమంలో  వారి కుటుంబ సభ్యులు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి  కొప్పుల ఈశ్వర్  దృష్టికి తీసుకు వెళ్లగా, స్పందించిన  ఆయన గత ఐదు రోజుల క్రితం  లక్ష్మి ఇంటికి వచ్చి ఆమెను పరామర్శిం చారు. హైదరాబాద్ లో ఆమెకు మెరుగైన వైద్య చికిత్స చేయించేందుకోసం  ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ. 2 లక్షల 50 వేల ఎల్. ఓ.సి  మంజూరు చేయించి, హైదరాబాద్ లో క్యాంపు కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మి కుటుంబ సభ్యులు మంత్రి  కొప్పుల ఈశ్వర్కు కృతజ్ఞతలు తెలియజేశారు.