అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకేల్లాలి  మంత్రి కొప్పుల ఈశ్వర్ 

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకేల్లాలి  మంత్రి కొప్పుల ఈశ్వర్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  మేడిపల్లి మండల కేంద్రంలోని పీ.ఎన్.ఆర్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లడుతూ రానున్న కాలంలో ఏ ఎన్నికలు జరిగినా సర్వ సన్నద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, ఎంపీపీ ఉమాదేవి, ప్రజా ప్రతినిదులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.