సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క ని కలిసిన సమగ్ర శిక్షణ సిఆర్పీ ల సంఘం.
![సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క ని కలిసిన సమగ్ర శిక్షణ సిఆర్పీ ల సంఘం.](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_64982ea341d20.jpg)
ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: విద్యాశాఖ సమగ్ర శిక్షణ లో పనిచేస్తున్న సిఆర్పిల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరుతూ ఆ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేటలో ఆదివారం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కని కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర కార్యదర్శులు షేక్ మహబూబ్ బాషా, కంచర్ల మహేందర్ లు, మల్లు భట్టి విక్రమార్క కి తమ సమస్యలను విన్నవించడం జరిగింది.
గత 15 సంవత్సరాలుగా విద్యాశాఖలో పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించలేదని, తమకు సరైనవేతనం అందడం లేదని , అలాగే రవాణా చార్జీలు, హెల్త్ కార్డులు ఏవి లేవని, చనిపోయిన సిఆర్పి లకు 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో సీఆర్పీల సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు, జిల్లా ప్రధాన కార్యదర్శి రామిడి వెంకటరెడ్డి, జిల్లా కోశాధికారి కట్టా రాజు , మహిళా కార్యదర్శి అన్నపూర్ణ, సఫియా పాల్గొనడం జరిగింది.