దాడి కేసులో ముగ్గురి అరెస్ట్
ముద్ర , కుషాయిగూడ: ఓ వ్యక్తిని దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై షఫీ కథనం ప్రకారం... ఆరే కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివాజిపై ఇటీవల హెచ్ బి కాలనీ లో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేసిన పోలీసులు హన్మకొండకు చెందిన ముగ్గురు నిందితులు లింగంపల్లి నానాజీ (37), N.సతీష్ (31), అవినాష్ (33) లను మేడిపల్లిలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చినట్లు తెలిపారు.