మహాత్ముడికి ఘన నివాళి

మహాత్ముడికి ఘన నివాళి

ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామ జిల్లాలోని మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. వైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట రోడ్డులోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మున్సిల్‌ చైర్‌‌పర్సన్‌ పోకల జమున లింగయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో గాంధీ సేవలను మరువలేనివన్నారు.

కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు అరుగుల శ్రీనివాస్, కౌన్సిలర్ హరిశ్చంద్రగుప్తా, పజ్జూరి జయహరి, గంగిశెట్టి ప్రమోద కుమార్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో వీవర్స్ కాలనీలో శ్రీరాం శ్రీనివాస్ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని నిర్వహించారు. డీసీసీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో సుంకరి శ్రీనివాస్ రెడ్డి, శివరాజ్‌ యాదవ్, వంగాల కల్యాణి మల్లారెడ్డి, ముస్త్యాల చందర్, మోటే శ్రీనివాస్, పిట్టల సతీశ్ పాల్గొన్నారు. బొడ్రాయి వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పొన్నాల వర్గం కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు మాసంపల్లి లింగాజీ, ధర్మపురి శ్రీనివాస్, బడికే ఇందిరా, కృష్ణస్వామి, చింతకింది మల్లేష్, ఎండీ మాజీద్, ఎంపీటీసీ సలెంద్ర శ్రీనివాస్, రఘు ఠాకూర్, రంగు రవి, సౌడ మహేష్ పాల్గొన్నారు.