మాదిగల అస్తిత్వాని కాపాడుకుంటాం

మాదిగల అస్తిత్వాని కాపాడుకుంటాం

ఇందిరా కు అండగా ఉంటాం

ముద్ర, జఫర్‌గడ్: రాజ్యాధికార కోసం మాదిగల అస్తిత్వాన్ని కాపాడుకుంటూ మాదిగ సామాజిక వర్గాన్ని చెందిన స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం ఇందిరాకు అండగా ఉంటామని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ దళిత నేతలు, దళిత జర్నలిస్ట్ బొల్లి పాక రాజేష్ అన్నారు. ఆదివారం జనగామ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ మాదిగల అస్తిత్వాన్ని రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి స్టేషన్గన్పూర్ లో మాదిగలందరూ ఏకతాటి కి రావలసిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గం మనుగడ దెబ్బ తినే అవకాశం ఉంది కనుక ఇక్కడ కచ్చితంగా మన అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో దాదాపు 80 వేల పై చిలుకు ఓట్లు ఉన్న మాదిగలను విస్మరించి కేవలం రెండు శాతం ఉన్న ప్రధాన పార్టీలైన అభ్యర్థులు కడియం శ్రీహరిని, గుండె విజయ రామారావును ఎన్నికల్లో మాదిగ జాతి ఏకతాటిపై నడిచి బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. నియంత పాలనకు చరమగీతం పాడాలంటే స్టేషన్ ఘనపూర్ దళిత ముద్దుబిడ్డ ఇందిరను గెలిపించాలని మాదిగ జాతికి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు ఇల్లందుల బాబు, నియోజకవర్గ నాయకులు డానియల్, మారపల్లి బాబు, డానియల్ మహారాజ్, అనిల్ కుమార్, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.