రైతులను ఆదుకుంటాం ... ఎమ్మెల్యే రాజయ్య

రైతులను ఆదుకుంటాం ... ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య రైతులకు భరోసా ఇచ్చారు. జనగామ జిల్లా చిలుకూరు మండలం కొండాపూర్, లింగంపల్లి గ్రామాలలో ఆదివారం పర్యటించి అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు, కేశిరెడ్డి మనోజ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.