క్రీడల్లో గెలుపు ఓటముల సహజం
పెద్దశంకరంపేట, ముద్ర:క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఎంపిపి జంగం శ్రీనివాస్ అన్నారు. బుదవారం స్థానిక ఎంపీపీ హాలులో గత మూడు రోజులుగా జరుగుతున్న ముఖ్యమంత్రి కప్ క్రీడా పోటీలో భాగంగా కబడ్డీ, వాలీబాల్, కోకో, అథ్లెటిక్స్ లో జరిగిన క్రీడా పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్య క్రమంలో ఎంపీటీసీ సభ్యులు వీణా సుభాష్ గౌడ్, స్వప్న రాజేశ్వర్ రావు, సర్పంచ్ లు కుంట్ల రాములు, విఠల్ గౌడ్, అనంతరావు, ఎంపిడిఓ రఫీకున్నిసా బేగం, ప్రధానోపాధ్యాయులు రామచంద్రచారీ, పిఈటీలు, ఎంఐఎస్ సంపత్ రెడ్డి, సంగమేశ్వర్, వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.