భూపాలపల్లిలో గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేయండి
- ఏఎంసి చైర్మన్ కొడారి రమేష్ యాదవ్
మొగుళ్లపల్లి, ముద్ర: భూపాలపల్లి గడ్డమీద గులాబీ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలంతా సైనికుల వలె పోరాడి..మన ప్రియతమ నేత..భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత గండ్ర వెంకట రమణారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పోతుగల్లు, గణేష్ పల్లి గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి ఆయన కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కావాలంటే..మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి జోరుక సదయ్య, ఆయా గ్రామాల సర్పంచులు తిప్పారపు యుగంధర్, నరేడ్ల రమాదేవి తిరుపతి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.