సీఎం జగన్‌కు వైఎస్ షర్మిల సంచలన లేఖ..

సీఎం జగన్‌కు వైఎస్ షర్మిల సంచలన లేఖ..

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ షర్మిల చాలా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా తన అన్న, ముఖ్యమంత్రి జగన్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ నిర్ణయాలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆయన సోదరి, ఏపీపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా ఈ రోజు బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న " న్యాయ నవ సందేహాలకు " సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.