యాదవ గర్జన సభను జయప్రదం చేయాలి - యాదవ సంఘం  జిల్లా అధ్యక్షులు పుట్ట వీరేష్ యాదవ్

యాదవ గర్జన సభను జయప్రదం చేయాలి - యాదవ సంఘం  జిల్లా అధ్యక్షులు పుట్ట వీరేష్ యాదవ్
  • యాదవ గర్జన  సభ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

ముద్ర ప్రతినిధి భువనగిరి : ఆగస్టు  8న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే  యాదవ గర్జన  సభను జయప్రదం చేయాలని యాదవ సంఘం  జిల్లా అధ్యక్షులు పుట్ట వీరేష్ యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక దీప్తి హోటల్ లో  యాదవ గర్జన సభ వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభకు యాదాద్రి భువనగిరి జిల్లా  నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాముల యాదవ్, డోలుదెబ్బ బెల్లి  చంద్రశేఖర్ యాదవ్, వై హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంశీ మోహన్ యాదవ్, యాదవ సంఘం ఉపాధ్యక్షుడు ఏర్పుల యాధమల్లయ్య , ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి, మాజీ ఎంపీపీ తోటకూర వెంకటేషయాదవ్,  జిల్లా కోఆర్డినేటర్ అవిశెట్టి రమేష్, కోశాధికారి దండమైన వీరేశం, ఎంపీటీసీ రాసాల మల్లేష్ యాదవ్, సర్పంచ్  శ్రీశైలం యాదవ్, కౌన్సిలర్ వడిచర్ల  కృష్ణ యాదవ్, చుక్కల శంకర్ యాదవ్, ఎల్లాముల బాలమల్లేష్ యాదవ్,రాసాల బాగ్యారాజ్ యాదవ్,  కుకుట్ల ఈశ్వర్ యాదవ్,  శ్రీకాంత్ యాదవ్ , అశోక్ యాదవ్, బోయిని పరమేష్ యాదవ్, కృష్ణ యాదవ్,కడరి నవీన్ యాదవ్, రాసాల శేఖర్ యాదవ్ , భాను యాదవ్, రాసాల లింగస్వామి యాదవ్ ,శ్రీరామ్ శరత్ యాదవ్, రాసాల నరసింహ యాదవ్, సాయి యాదవ్ మేకల రాజు యాదవ్, మల్లె బోయిన కిట్టు యాదవ్  పాల్గొన్నారు.