ప్రజా సమస్యలపై పనిచేసే సిపిఎం అభ్యర్థి కొండమడుగు నరసింహను గెలిపించండి :

ప్రజా సమస్యలపై పనిచేసే సిపిఎం అభ్యర్థి కొండమడుగు నరసింహను గెలిపించండి :
  • సి పి ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం

ముద్ర, బీబీనగర్ :ప్రజా సమస్యలపై పనిచేసే సిపిఎం అభ్యర్థి కొండమడుగు నరసింహను గెలిపించాలని బీబీనగర్ మండల కేంద్రంలో  సి పి ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం స్థానిక నాయకత్వంతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు. సి పి ఎం ఆధ్వర్యంలో మూసి ప్రక్షాళన కోరుతూ పోరాటాలు నిర్వహించామని ,పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అనేక పోరాటాలు చేసిన చరిత్ర సి పి ఎం పార్టీకి ఉన్నదని ,కార్మికుల సమ్మె పోరాటాలకు సి ఐ టి యు నాయకత్వం వహిస్తే ప్రతి పోరాటానికి సి పి ఎం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించి అండగా నిలబడిందని గుర్తుచేశారు. ప్రజలు,సమస్త కార్మికులు, ఉద్యోగులు సి పి ఎం అభ్యర్ధి కొండమడుగు నరసింహ సుత్తె కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి ప్రజల తరుపున పని చేసే వారికి పట్టం కట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సి పి ఎం మండల కార్యదర్శి గాడి శ్రీనివాసు, మండల కార్యదర్శి వర్గ సభ్యులు టంటం వెంకటేష, మండల కమిటి సభ్యులు ఎల్లాముల సత్యనారాయణ, నాయకులు బండారి శ్రీరాములు  పాల్గొన్నారు.