పరస్పర సహకారంతో పని చేయాలి : జడ్పీ చైర్ పర్సన్ శోభ

పరస్పర సహకారంతో పని చేయాలి : జడ్పీ చైర్ పర్సన్ శోభ

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:కామారెడ్డి జిల్లాలో అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సహకారం తో, సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి పాటుపడాలని జడ్పీ చైర్ పర్సన్ శోభ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం జెడ్పీ చైర్ పర్సన్ శోభ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఉపాధిహామీ, ఆర్అండ్బి రోడ్లు, వ్యవసాయం, పంచాయతీ శాఖలపై సమీక్ష నిర్వహించారు.  కలెక్టర్ జితేష్ వి పాటిల్, జెడ్పి సీఈవో సాయ గౌడ్, అధికారులు, జడ్పిటిసి లు పాల్గొన్నారు.