కామారెడ్డి జిల్లా అబ్జర్వర్ గా అబ్దుల్ ఖయ్యూం నియామకం

కామారెడ్డి జిల్లా అబ్జర్వర్ గా అబ్దుల్ ఖయ్యూం నియామకం

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా లోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజక వర్గాలకు ఎలక్షన్స్ అబ్జర్వర్ గా అబ్దుల్ ఖయ్యూం ఐపీఎస్ నియామకం అయ్యారు.  ఈ మేరకు శుక్రవారం నుండి కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో గల సూట్ నెంబర్ 1 లో ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎవరైనా రాజకీయ పార్టీల వారు కానీ, అభ్యర్థులు గాని, ప్రజలు గాని, ఏదైనా అత్యవసర సమయంలో మరేదైనా ఎన్నికల సమాచారం తెలియజేయు నిమిత్తం లేదా మరేదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సంప్రదించాలని తెలిపారు.  సెల్ నం. 871268 6095 నెంబర్ పై ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చని తెలిపారు. అలాగే పౌరులు ప్రతి ఒక్కరూ మెరుగైన సమాజం కొరకు తమ పవిత్రమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అబ్దుల్ ఖయ్యూమ్ మీడియాతో ఒక ప్రకటనలో తెలిపారు.