రేపటి నుంచి యధావిధిగా ప్రజావాణి    

రేపటి నుంచి యధావిధిగా ప్రజావాణి    

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 11 నుండి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్  ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో  ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ఈ నెల 11 నుండి కలెక్టరెట్ లోని ప్రధాన సమావేశం మందిరంలో ఉదయం  10.30 గంటల నుండి ప్రజావాణి కార్యక్రమం తిరిగి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమ వినతులను అధికారులకు అందజేసి పరిష్కారం పొందవలసినదిగా కలెక్టర్ సూచించారు.