బాన్సువాడలో మొరం మాఫియా

బాన్సువాడలో మొరం మాఫియా
  • పట్టపగలే అక్రమంగా మొరం తరలింపు 
  • గుట్టలు మాయం
  • అనుమతి ఉందని బుకాయింపు

ముద్ర ప్రతినిధి బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో మొరం మాఫియా పట్టపగలేకుండా కొనసాగుతుంది. నిన్నటి మొన్నటి వరకు ఇసుక మాఫియా యదేచ్చగా కొనసాగింది
వానలు కురవడం మూలాన మంజీరా లో నీళ్లు వస్తున్న నేపథ్యంలో మాఫియా మొరం వైపు కన్నేసింది. ఏలాంటి అనుమతులు లేకుండా పట్టపగలు మొరం సరఫరా జరుగుతుంది. బాన్సువాడ పట్టణం సమీపంలోని బొర్లం వెళ్లి దారి లో ఉన్న గుట్టల నుండి మొరం యంత్రాలను ఉపయోగించి మొరం తరలిస్తున్నారు. ఒక టిప్పర్ నాలుగు వేల రూపాయల లకు అమ్మకాలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు
ప్రతిరోజు 20 నుంచి 50 ట్రిపుల్ వరకు ఈ మొరం కొనసాగుతుంది. ప్రతిరోజు ఈ దందా అడ్డు అదుపు లేకుండా కొనసాగుతుంది. టిప్పర్ యజమానులు కొందరు ఈ మాఫియాతో కుమ్మక్కై మొరం తరలిస్తున్నట్లు తెలుస్తుంది.