రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు      

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు      

పెద్దశంకరంపేట, ముద్ర: మండల పరిధిలోని కోలపల్లి పాత టోల్ ప్లాజా వద్ద నాందేడ్ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న బోలేరా వాహనం  డివైడర్ పైకి ఎక్కడంతో ఇరువురికి గాయాలైన సంఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది.

బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న నాందేడ్ కు చెందిన అర్పత్, సాదిక్ లకు గాయాలు కావడంతో ఎన్ హెచ్ ఏ అంబులెన్స్ లో పెద్ద శంకరంపేట లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  పెద్ద శంకరంపేట పోలీసులు విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మరో సంఘటన లో కోలపల్లి పాత టోల్ ప్లాజా వద్దనే అల్లాదుర్గం నుండి వస్తున్న చెరుకు లారీ మాఘీ ఫ్యాక్టరీ కి వెళ్తుండగా డివైడర్ కు గుద్దుకొని చెరుకు మొత్తం పడిపోయింది.  ఈ సంఘటనలో కూడా ఎవరికి గాయాలు కాలేదు.