సంచలనం రేపిన ‘ఆదిపురుష్’

సంచలనం రేపిన ‘ఆదిపురుష్’

ఓం రౌత్ దర్శకత్వం వహించిన ‘ఆదిపురుష్’లో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ ప్రదాన పాత్రధారులుగా నటించారు. ఈ చిత్రం జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా  ప్రమోషన్స్ వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తిరుపతిలో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ ఈవెంట్ కు లక్షలాది ఫాన్స్ విచ్చేసారు. టీ సిరీస్, యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాను, తెలుగు ప్రేక్షకులకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అందిస్తున్నది.