ఇండో పాక్ యుద్దల్లో సైనికులకు ఆర్ఎస్ఎస్ సేవలు 

ఇండో పాక్ యుద్దల్లో సైనికులకు ఆర్ఎస్ఎస్ సేవలు 
  • నిజాలు చెప్పని జీవన్ రెడ్డి అంకుల్ 
  • ఎన్నికల్లో ఓడినా జీవన్ రెడ్డికి మంత్రి పదవి
  • బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఎంపీగా జీవన్ రెడ్డి అంకుల్ కు టికెట్ దక్కి పోటీలో ఓడితే రాష్ట్రం లో మంత్రి పదవి దక్కుతుందని, మోడి ప్రభంజనం తో ఎంపీ అరవింద్ కచ్చితంగా గెలిచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి అన్నారు. జగిత్యాల లోని కమలా నిలయంలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రావణి మాట్లాడుతూ జగిత్యాలలో బీజేపీ సంకల్ప యాత్ర ముగియక ముందే ఎక్కడ ఒడిపోతనోననే భయంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ లో గత చరిత్రఫై తప్పుడు ప్రచారులు మాట్లాడారని ఇదిగో వాటికీ రుజువులు అంటూ పలు విడియోలను చూపించారు. ఇందీరా గాంధీ అపర కాళిక అని తాను అనలేదని వాజ్ పాయ్ మీడియా కు చెప్పిన వీడియోతో పాటు కాంగ్రెస్ నాయకులు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సోనియాని బలి దేవత అని సంభోందించిన విషయాన్ని మరిచిపోయారని ప్రశ్నించారు.

అప్పటి యువ నాయకుడు అరవింద్ చెరుకు రైతుల కోసం పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. వైఎస్ రాజ శేఖర్ రెడ్డి హాయం లో వేసిన హౌజ్ కమిటి లో జీవన్ రెడ్డి మెంబర్ గా ఉండి రైతుల కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. దశాబ్దాల కాలం లో రైతులకు లబ్ది చేయని మీరు ఇప్పుడు చేస్తామని చెపితే ప్రజలు నమ్మె పరిస్థితి లో లేరన్నారు. గత చరిత్రలు తవ్వుకుంటే మీకే బాగుండదని, జగిత్యాలను ఉగ్ర వాదులకు అడ్డగా మారకుండా చూసుకుంటే చాలన్నారు. ఆదాని, అంబానీలు బీజేపీ పాలన లో ఎదిగినట్లు మాట్లాడుతున్నారని, చరిత్ర లో ఇందీరా గాంధీ, రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్లి వంగి వంగి ఫోటోలు దిగారో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన లో చేసిన యుద్ధాలలో ఆర్ఎస్ఎస్ ప్రధాన పాత్ర ను అప్పటి పీఎం నెహ్రూ గుర్తించి పరేడ్ లో కితాబు ఇచ్చారని తెలిపారు. పీఎం మోడి రైతుల కోసం కిషన్ సమ్మాన్ యోజన కింద పెట్టుబడి సాయం, యూరియా పై  సబ్సిడీ అందజేస్తున్నారని తెలిపారు.

ఎంపీ అరవింద్ బాండ్ పేపర్ హామీ మేరకు పసుపు బోర్డు మంజూరు చేశారని, జగిత్యాల జిల్లా కు నవోదయ స్కూల్ చాల అభివృద్ధి పనులు చేశారని జాబితా వివరించారు. మహా కాళేశ్వర్ కారిడార్, కాశీ కారిడార్, రామాలయ నిర్మాణం మోడీ హాయం లో జరిగాయన్నారు. గుళ్లు కట్టామని చెపుతున్న జీవన్ రెడ్డి కొండగట్టు కోనేరు, ధర్మపురి గోదావరి ఎందుకు కనిపించలేదో చెప్పాలని ప్రశ్నించారు. కొడంగల్ కు సీఎం రేవంత్ రెడ్డి 4 వేల కోట్లు తీసువెళ్లారని, ఇప్పటికైనా ఫండ్స్ తీసుకురావాలని సూచించారు.  గతం లో వైఎస్ రాజశేకర్ రెడ్డి హాయం లో ఎమ్మెల్యే ఓడిన జీవన్ రెడ్డికి మినిస్టర్ పదవి వచ్చిందని, ఇప్పుడు ప్రజలు జీవన్ రెడ్డిని ఓడకొట్టినా మినిస్టర్ పదవి దక్కుతుందని జోస్యం చెప్పారు. ఆరవింద్ గెలిపు తో కేంద్ర మంత్రి పదవి వరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర, కేంద్ర మినిస్టర్ల తో జగిత్యాలను అభివృద్ది చేసుకుందమన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షుడు రంగు గోపాల్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అనుమల్ల కృష్ణహరి,జగిత్యాల రురల్ మండల్ అధ్యక్షుడు నలువాల తిరుపతి,పట్టణ ప్రధానకార్యదర్శి ఆముద రాజు,జిల్లా కోశాధికారి సుంకేట దశరథ్ రెడ్డి, సింగం పద్మ, కాసేటి తిరుపతి, వంశీ, ప్రశాంత్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు