పెన్ పహాడ్ మండలంలో కాంగ్రెస్ కు బిగ్ షాక్
![పెన్ పహాడ్ మండలంలో కాంగ్రెస్ కు బిగ్ షాక్](https://mudranews.in/uploads/images/2023/09/image_750x_650e67045645e.jpg)
- కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరిన 25 కుటుంబాలు
- గులాబీ కండువా కప్పి సాదర స్వాగతం పలికిన మంత్రి జగదీష్ రెడ్డి
- మండల పార్టీ అధ్యక్షులు యుగంధర్ ఆధ్వర్యం లోజరిగిన చేరికలు
ముద్ర ప్రతినిధి సూర్యాపేట: పెన్ మండలం లో కాంగ్రెస్ పార్టీ కి షాక్ తగిలింది. తమ బతుకులు మార్చిన. అభివృద్ధి పార్టీ బీఆర్ఎస్ వైపే మా పయనం అంటూ దోస పహాడ్ గ్రామానికి చెందిన 25 కాంగ్రెస్ కుటుంబాలు గులాభీ తీర్థం పుచ్చుకున్నాయి..ఈ సినిమా మేరకు సూర్యాపేట లోని క్యాంపు కార్యాలయం లో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో 25 కుటుంబాల కు చెందిన వారితో పాటు మరో 70మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. వీరందరికి కండువా కప్పి న మంత్రి సాదర స్వాగతం పలికారు. మండల పార్టీ అధ్యక్షులు దొంగరి యుగంధర్, ఎంపిటిసి నాగరాజు ఆధ్వర్యం లో చేరికలు జరుగగా పరెల్లి రామకృష్ణ, గోగుల జానికి రాములు, గోగుల పెద్దులు, దొండ లింగమ్మ, పేరపంగి సైదులు, మధు, మార్త, దొంగరి నాగరాజు, ఎల్లయ్య, మునుగూరి నరేష్, నర్సమ్మ, గద్దల వంశీ ఇతర కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు.. కార్యక్రమం లో జడ్పీటిసి మామిడి అనిత అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.