కందనులుకు నేడే బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాక

కందనులుకు నేడే బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా రాక

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం జరిగే భారతీయ జనతా పార్టీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సభకు ముఖ్యఅతిథిగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతుండడంతో ఏర్పాట్లలో ఎలాంటి తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సభకు లక్ష మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లో సభా వేదిక ప్రాంగణం, రహదారులు అంతా కాషాయమేమయ్యాయి. భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుండి నుండి జన సమీకరణకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను బిజెపి రాష్ట్ర నాయకుడు దిలీప్ ఆచారి పర్యవేక్షిస్తున్నారు. సభను విజయవంతం చేసేందుకు బిజెపి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ నాయకులు డీకే అరుణ తోపాటు రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారు.