తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా  నివేదిత అనాధాశ్రమంలో అన్నదానం

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా  నివేదిత అనాధాశ్రమంలో అన్నదానం

 ముద్ర,రాయికల్ : రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో ఉన్న నివేదిత వృద్ధాశ్రమంలో  వృద్ధులకు  తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది.తొమ్మిది నెలల లో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ నాయకత్వంలో అధికారం చేపట్టి చరిత్ర సృష్టించిందని ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు రెండు రూపాయల కిలో బియ్యం, మహిళలకు సమాన హక్కు, గృహ నిర్మాణ పథకం, పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు, మహిళలకు ఎన్నికల రిజర్వేషన్,బలహీన వర్గాలకు రాజకీయంలో చైతన్యం మాండలిక వ్యవస్థ ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి తెలుగు ప్రజల గుండెలలో  ఎన్టీఆర్ నిలిచారని  తెలిపారు.

రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు  అవుతారని ఆయన తెలిపారు. అలాగే రాబోయే రోజులలో తెలంగాణలో  తెలుగుదేశం పార్టీ కొరకు అందరూ కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో  బాలే మారుతి, చొప్పరి శేఖర్, ఎండి నజీరుద్దీన్, షేక్ దస్తగిరి, ఎనిగందుల శ్రీనివాస్, మహమ్మద్ సమీర్ తదితరులు పాల్గొన్నారు.