ఒకరిపై కేసు నమోదు

ఒకరిపై కేసు నమోదు

రామకృష్ణాపూర్, ముద్ర : గంజాయి సేవిస్తూ, అమ్మకాలు చేపడుతున్న గుడిపెల్లి గ్రామానికి చెందిన జాడి రవి కిరణ్ పై కేసు నమోదు చేసినట్లు మందమర్రి సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం గుడిపెల్లి గ్రామంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో రవి కిరణ్ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేశారు. ఈ మేరకు వంద గ్రాముల గంజాయి లభించినట్లుగా రామకృష్ణాపూర్ పట్టణ ఎస్సై జి. రాజశేఖర్ పేర్కొన్నారు.