ప్రజా క్షేత్రంలో గెలవలేక అసత్య ప్రచారాలు

ప్రజా క్షేత్రంలో గెలవలేక అసత్య ప్రచారాలు

 మాజీ  ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : ప్రజా క్షేత్రంలో గెలవలేక నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్  లో ఆదివారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ జెన్ కో లో సీఎండీ ప్రభాకర్ రావు బోయినపల్లి సరితరావు అనే యువతికి ఏఈ ఉద్యోగం ఇచ్చారని నెలకు 1.50లక్షల జీతభత్యాలు ఇస్తున్నారని ఆ యువతి మాజీ ఎంపీ  వినోద్ కుమార్  బంధువు అని మాట్లాడటంతో పాటు తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ లో ప్రసారం చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా మిత్రులు, బంధువులు ఫోన్లు చేశారు. వినోద్ మీకు అన్న లేరు అసలు అన్నబిడ్డ ఎక్కడ నుంచి వచ్చారు అని అడుగుతున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టులు వార్తను పబ్లిష్ చేసే మందు వాస్తవాలను తెలుసుకోవాలని చెప్పారు. తీన్మార్ మల్లన్న నా వివరణ తీసుకోకుండా క్యూ న్యూస్ లో వార్త ప్రసారం చేయడం సరికాదన్నారు.

అసలు ఆ ఉద్యోగం ఎవరికి వచ్చింది ఎవరు ఇచ్చారనే విషయం నాకు తెలియదన్నారు. దీనిపై బండి సంజయ్, బిజెపి నాయకులు సమాధానం చెప్పాలన్నారు. రాజకీయ ప్రత్యర్థులు ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి అంతే తప్పా బండి సంజయ్, అతడి  అనుచరులు ఇలాంటి దిక్కుమాలిన వ్యవహారం చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004లో మొదటి సారిగా ఎంపీగా గెలిచాను. ఇప్పటికి 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఇప్పటివరకు ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ప్రచారం చేసే వార్తలో ఎంత వరకు నిజం ఉంది.

ఎంత వరకు అబద్ధం ఉంది అనేది తేల్చుకున్న తర్వాత వార్తలు ప్రసారం చేయాలి. ఇలాంటి తప్పుడు రాతలు రాస్తే  సమాజానికి మంచిది కాదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణ రావు, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవిందర్ సింగ్, మేయర్ సునీల్ రావు, సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవిందర్ రెడ్డి, బీఆర్ఎల్ సీనియర్ నాయకులు జమీల్, చీటి రాజేందర్ రావు, జక్కుల నాగరాజు, ప్రభావతి, మధుసూదన్ రెడ్డి, హరిప్రసాద్, సంపత్ గౌడ్, సాజిద్, శోభ, రేణుక, రేణుక తదితరులు పాల్గొన్నారు.